ఈ బ్లాగ్ లో ప్రచురింపబడిన వ్యాసాలు - ఈ బ్లాగు ఓనర్ వి మాత్రమే కావు. ఇవి అందరివి కూడా. ఈ వ్యాసాలను ఎవరైనా వాడుకోవచ్చు. వారి పేరు పెట్టుకుని ప్రచురించుకున్నా అభ్యంతరం లేదు. 🙂
అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.) చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం. "రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ | ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||" రే రే రావణః; రావణాః = రావణులు; కతి = ఎంతమంది? వయం = మేము; బహూన్ = అనేక పేర్లను శుశ్రుమః = విన్నాను; కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత; దోర్దండ = బాహువుల చేత; పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది; ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట; ఏకం = మరొకటి...
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
ప్రస్తావన: ఈ వ్యాసానికి ముందు మరొకసారి ఇదివరకటి " భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు " - అన్న వ్యాసంలో ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేద్దాం. క్రీ.శ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆధునిక భారతదేశచరిత్రను వ్రాయతలపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి, రాయల్ ఏషియాటిక్ సొసయిటీని స్థాపించిన సర్ విలియమ్ జోన్స్. ఆ సంస్థలో భారతీయులు ఒక్కరూ లేరు. సర్ విలియమ్ జోన్స్ కు భారతదేశంపై, ఈ దేశ ఔన్నత్యంపై, చరిత్రపై ఏమాత్రం సదభిప్రాయం లేదు. అతడు వ్రాయదల్చుకున్నది పాలకుల దృష్టిలోని భారతదేశచరిత్ర మాత్రమే. జోన్స్ కు సంస్కృతం, ఇతర భారతదేశభాషలు రావు. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలపై ఆతనికి అవగాహన శూన్యం. ఈతడు రాధాకాంత తర్కవాగీశుడనే అతనితో పౌరాణిక రాజవంశావళిని చెప్పించుకున్నాడు. ఆతడు వ్రాసిన చరిత్రకు Sheet anchor - అనామతు గ్రీకు పుస్తకపు అనువాదంలోని సాండ్రోకొట్టసు అనబడే వ్యక్తి. అతణ్ణి మౌర్యచంద్రగుప్తునిగా, క్రీ.పూ. 327 కాలం నాటి వాడిగా ఆతడు నిర్ణయించినాడు. ఆతడు నిర్ణయించిన Sheet anchor ను కోల్ బ్రూక్ తదితర ఉద్యోగులే ఖండించారు. గ్రీకు అలెగ్జాండరూ, భారతదేశ సాండ...
మీరు ఇలా ప్రకటించడం అభినందనీయం. 🙏🏻
రిప్లయితొలగించండి