పోస్ట్‌లు

సమస్యాపూరణం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నేను వ్రాసిన మొదటి సంస్కృత శ్లోకం

కస్యాః ముఖం శర్వమనోనిధానమ్ ? ప్రీత్యా త్రినేత్రస్తు కరోతి కిం తాం ? దృష్ట్వా తు తౌ మోదమవాప్యవాన్ కః ? గౌరీముఖం ; చుమ్బతి ; వాసుదేవః పై శ్లోకంలో దోషం చెప్పిన వారికి ఆ దోషపరిహారం చేసే బాధ్యత కలదు . (11 వ త్రిష్టుప్ ఛందంలోని ‘ ఇంద్రవ్రజ ’ అనే వృత్తం. దీని గణాలు ‘ త-త-జ-గగ(గా) ’ లు. తెలుగులో యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది. ) ఆ శ్లోకానికి కంది శంకరయ్య గారి అనువాదం. (గురువు గారు, అది నా ప్రయోగం అని గ్రహించలేదు. అయినా మన్నన దొరికింది కాబట్టి సంతోషం) తే.గీ|| ఎవరి ముఖమును హరుఁడు వీక్షించినాఁడు ? ప్రీతి దాని నేమి యొనర్చెఁ ద్రినయనుండు ? పొంచి దానిని వీక్షించి మురిసె నెవఁడు ? గౌరి ముఖమును ; చుంబించెఁ ; గరివరదుఁడు. తెలుగే బావుంది.. మనస్ఫూర్తిగా.

తేటగీతి గర్భిత చంపకమాల

నా మొదటి గర్భకవిత. చం|| కనుగొనఁ జక్కనౌ సిరియె గాదిలి పత్నియు సింహరూపి యై ప్రణతులఁ గాచునా హరికి; వాణియె భార్య మహాత్ములెన్న గా ధునివలె యబ్ధికిన్ శతధృతుండు-విరించికి; సాంబమూర్తి కి న్ననయముఁ గూర్మిగా వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె డిన్. గర్భిత తేటగీతి: సిరియె గాదిలి పత్నియు సింహరూపి హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న శతధృతుండు విరించికి; సాంబ మూర్తి వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె. పై పద్యాలు రెంటికీ "హరికి వాణియె భార్య మహాత్ము లెన్న" అన్న శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన సమస్య మూలం. తేటగీతి గర్భిత చంపక/ఉత్పల మాల వ్రాయడానికి సూచనలు: ౧. మొదట తేటగీతి పద్యంతో ఆరంభించాలి. ౨. మామూలుగా తేటగీతిలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు కావాలి. గర్భిత తేటగీతి మాత్రం ప్రతిపాదమూ "న భ భ ర ల" గణాలతో ఉండాలి. ౩. రెండవ గణం "భ" మొదటి అక్షరం చంపక/ఉత్పల మాల తో యతిమైత్రి చెల్లించాల్సిన స్థానం. గుర్తుపెట్టుకోవాలి. ౩. పాదాంతంలో సమాసాలు కూరిస్తే ఇబ్బంది. ఉదా: "కామదహనుడు" - ఇందులో "కామ" పాదం చివర్లో వచ్చి తరువాతి పాదం "ద...