6, ఆగస్టు 2011, శనివారం

నేను వ్రాసిన మొదటి సంస్కృత శ్లోకం



కస్యాః ముఖం శర్వమనోనిధానమ్?
ప్రీత్యా త్రినేత్రస్తు కరోతి కిం తాం?
దృష్ట్వా తు తౌ మోదమవాప్యవాన్ కః?
గౌరీముఖం; చుమ్బతి; వాసుదేవః

పై శ్లోకంలో దోషం చెప్పిన వారికి ఆ దోషపరిహారం చేసే బాధ్యత కలదు.

(11వ త్రిష్టుప్ ఛందంలోని ఇంద్రవ్రజ అనే వృత్తం. దీని గణాలు త-త-జ-గగ(గా)లు. తెలుగులో యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది.)

ఆ శ్లోకానికి కంది శంకరయ్య గారి అనువాదం. (గురువు గారు, అది నా ప్రయోగం అని గ్రహించలేదు. అయినా మన్నన దొరికింది కాబట్టి సంతోషం)

తే.గీ||
ఎవరి ముఖమును హరుఁడు వీక్షించినాఁడు?
ప్రీతి దాని నేమి యొనర్చెఁ ద్రినయనుండు?
పొంచి దానిని వీక్షించి మురిసె నెవఁడు?
గౌరి ముఖమును; చుంబించెఁ; గరివరదుఁడు.

తెలుగే బావుంది.. మనస్ఫూర్తిగా.