పోస్ట్‌లు

The distortion of Indian History - Perspective (Part1)

చిత్రం
In the modern world, every country has its history. Historians and academicians belonging to a country carefully study, preserve and narrate their country's history. India is probably the only country in the current world has 2 or 3 versions of ancient history. (We may assume it as 2.5 versions as we see while the essay unfolds). Especially these versions are predominant for the history 3000 years before common era till 5th century AD. (3000BC - 500 AD) Let me enumerate a small example: Once upon a time in India there was a great poet was there. His name is Kalidasa.  When he was existed? Undoubtedly he was existed before 6th century AD. Reason: There is an inscription in Aihole, Karnataka where his name is mentioned. So the poet existed somewhere before 600 AD according to the evidence.  If we examine the secondary evidences too, then there are below possibilities.  His time period might be 1st century BC - This we call version 1. somewhere between 400 AD and 600 AD...

మయూఖము - 6

చిత్రం
ఇంద్రచాపమనే ఈ బ్లాగును సంధించి చాలా రోజులయ్యింది. అసలు ఈ బ్లాగు, రాత, తాపత్రయమూ వదిలేసి పారేసేంత విరక్తి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో చాపల్యం కుడుతుంది. నాలో లక్ష లోపాలు ఉండవచ్చు గాక. ఓ పది ఎన్నదగిన గుణాలు ఉండొచ్చునేమో కదా. అలా ఉంచితే సంస్కృతం ఎవరికీ కాబట్టని రోజుల్లో ఏదో ఆ భాష గురించి తెలిసినది రాస్తే, అది ఏదో పొద్దు ఎవరికైనా పనికొస్తుందేమో కదా అని.  అప్పుడే ఇలా భూత్ బంగళా గోడలపై బొగ్గుతో గీసిన రాతలాంటి రాత. ఈ మయూఖాన్ని ప్రసరింపజేసిన కవి ధర్మసూరి. ధర్మసూరి అన్న కవి వారణాసి వాస్తవ్యుడు. యజుర్వేదీకుడు. కాలం తెలియదు. ఆయన నరకాసురవిజయం అనే వ్యాయోగాన్ని రచించాడు. వ్యాయోగం అనేది దశరూపకాల్లో ఒకానొక రూపకభేదం. వ్యాయోగం - ఏకాంకిక అయి ఉండాలి. నాయకుడు ధీరోద్ధతుడు కావాలి. ధీరోద్ధతుడు అంటే వికత్థనుడు, (వికత్థనుడు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాడు) అహంభావి. స్త్రీపాత్రలు తక్కువగా ఉండాలి. ఈ వ్యాయోగంలో పెద్దగా కథాభాగం ఏదీ లేదు. నాయకుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామతో కలిసి నరకాసురునితో పోరడం, అందులో గెలుపొందడం రూపక ఇతివృత్తం. తను చేయబోతున్న యుద్ధం తన సుతునితోనే అని భూదేవి అవతారమైన సత్యాదేవికి పాపం...

మయూఖము - 5

చిత్రం
విష్ణువు - వైష్ణవం ఇంద్రుడు - ఐంద్రీ (తూరుపు దిక్కు) వినత - వైనతేయుడు మిత్రుడు - మైత్రి విరాగి - వైరాగ్యము విదేహ - వైదేహి వివిధములు - వైవిధ్యత ధీరుడు - ధైర్యము సంస్కృతంలో ’ఇ’ కారంతో ఆరంభమయ్యే కొన్ని శబ్దాలయొక్క ’సంబంధించిన’ అన్న అర్థంతో వచ్చు రూపాలు ’ఐ’ కారంతో ఏర్పడతాయని మనకు తెలుస్తోంది. నేను వ్యాకరణ వేత్తను కాను కాబట్టి ఏ శబ్దాలకు అలా ’ఐ’ కారపు రూపాలు ఏర్పడతాయో తెలియదు. విష్ణువు - నకు "సంబంధించినది" వైష్ణవము. ఈ "సంబంధించిన" అన్న అర్థమే ఇటువంటి శబ్దాలన్నిటికీ ఏర్పడుతోంది. ఇదే రకంగా "కైలాసము" అన్న శబ్దం ఎలా ఏర్పడి ఉందాలి? ’కిలాసః - కైలాసము.’ కిలాసః = పరమేశ్వరుడు. ఆతనికి సంబంధించినది/ఆతని నివాసము కైలాసము అని వ్యుత్పత్తి సాధ్యం కావాలి. అయితే ఒక ఇబ్బంది. "కిలాసమ్" అంటే అమరకోశం ప్రకారం పొడ వ్యాధి. " కిలాసం సిధ్మకచ్ఛ్వాం తు పామపామే విచర్చికా " - ఇవన్నీ పొడ/గజ్జి/కుష్ఠు పేళ్ళు. కిలాసిన్ అంటే పొడ వ్యాధి గ్రస్తుడు. కిలాస శబ్దానికి పండుబారిన జుత్తు అని కూడా అర్థం ఉందట. "కిలాస" శబ్దానికి పరమేశ్వరార్థం సాధారణంగా కనిపిం...

మాణి - టిబెటన్ ప్రార్థనా చక్రము

చిత్రం
"టిబెటన్ బౌద్ధులు మహాయాన సాంప్రదాయాన్ని పాటిస్తారు. తాము ఆర్జించిన సమస్త పుణ్యాన్ని ప్రాణికోటికి సమర్పించడమే మహాయాన బౌద్ధమత లక్ష్యం. ఎవరు చెప్పొచ్చారు? ఘోరమైన పాపాలలో మునిగి ఉన్న భూమండలంలోని మనుష్యులను సముద్రగర్భంలో ముంచి వేయకుండా భూగర్భంలో కూరుకుపోకుండా టిబెట్ లోని ఈ వేల మాణీలే పని చేస్తున్నాయేమో!" - రాహుల్ సాంకృత్యాయన్. ( తిబ్బెత్ మే సవ్వా బరస్) ******* థిక్సే బౌద్ధారామం లోని మాణి మాణీ అన్నది బౌద్ధ సాంప్రదాయంలో కనిపించే ఒకానొక చక్రం. దీనికి ఖోర్లో ( འཁོར་ལོ། ) అని  పేరు .  లడక్ లో చాలాచోట్ల, ముఖ్యంగా దేవాలయాలలో వరుసగా అమర్చిన చక్రాలు కానీ, లేదా చాలా పెద్దదైన ఒకే చక్రం కానీ కనిపిస్తుంది. ఈ తరహా చక్రాలు లడఖ్ లో మిలటరీ కార్యాలయాల ముందు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఆ చక్రంపైన "ఓమ్ మణిపద్మే హుమ్" అన్న మంత్రం వ్రాయబడి ఉంటుంది. ఈ చక్రం కొయ్యతో కానీ, లోహంతో కానీ చెయ్యబడి ఉంటుంది. మధ్యలో ఇరుసు మాత్రం కొయ్యది అయి ఉంటుంది. ఈ పెద్దచక్రం పై భాగాన ఒక కర్ర బయటకు వచ్చి ఉంటుంది. ప్రతి ప్రదక్షిణంలోనూ ఈ కొయ్య కర్ర - ఆ చక్రానికి పక్కనున్న ఘంటకు తగిలి దానిని మోగిస్తుంది. ...

టిబెటన్ స్థూపం.

చిత్రం
బౌద్ధంలో హీనయాన మహాయానాల తరువాత వచ్చిన మతసిద్ధాంతం వజ్రయానం. వజ్రయానంలో బుద్ధుణ్ణి ఒక చారిత్రక వ్యక్తిగా కాక, ఒక అలౌకిక శక్తిగా భావించటం ఉంటుంది. దరిమిలా బుద్ధుని చుట్టూ అనేక బోధిసత్వ అవతారాలు, ఆ అవతారాలకు కొన్ని చిహ్నాలు, ఆ చిహ్నాల చుట్టూ అల్లుకున్న మార్మికత, మండలాలు అనబడే చిత్రాలు, ఆ చిత్రాలకనుగుణంగా ధ్యానపద్ధతులు - ఇలా విలక్షణంగా అల్లుకున్న ప్రత్యేకమైన, ధార్మిక విశ్వాసయుతమైన మతం వజ్రయానం. ఈ విశ్వాసాలకు అనుగుణంగా అవలోకితేశ్వర, మైత్రేయ, వైరోచన, అమితాభ, మహాకాల, అమోఘసిద్ధి, పద్మసంభవ, మంజుశ్రీ ఇత్యాది అద్భుతమైన మూర్తులు, చిక్కని రంగులతో దట్టంగా చిత్రించిన బుద్ధుని అవతారాల బొమ్మలు, ఇంకొన్ని చిహ్నాలు వజ్రయానం లో చోటుచేసుకొని ఇది శాఖోపశాఖలుగా ఎదిగింది. వజ్రయాన మార్మిక బౌద్ధ మూర్తులలో హిందూ దేవతల, దేవుళ్ళు కూడానూ హెచ్చుగానే కనిపిస్తారు. అలాగే బౌద్ధం లో గల కొందరు చారిత్రకవ్యక్తులను బోధిసత్వుని అవతారాలుగా చిత్రించటం ఉంది. ఉదాహరణకు పద్మసంభవుడు ఒక చారిత్రక వ్యక్తి. ఆయన బోధిసత్వుడి అవతారం. లామా కూడా బోధిసత్వుడి అవతారమే. టిబెటన్ బౌద్ధపు ఛాయలు ఇవి. ఈ టిబెటన్ బౌద్ధంలో ఓ చిహ్నం గురించి ఈ వ...

మయూఖము - 4

సంస్కృతకవులలో దండి, క్షేమేంద్రుడు, ఆనందవర్ధనుడు, జగన్నాథపండితుడు ఇత్యాదులనేకులు కవులే కాక లాక్షణికులు కూడానూ. ఆ మాటకొస్తే కవులందరున్నూ లాక్షణికులేననుకోండి. ఎంతో కొంత లక్షణలక్ష్యాలు తెలిస్తేనే కదా కవిత్వరచన అంటూ కొనసాగేది?  అయితే ప్రత్యేకంగా లక్షణగ్రంథాల్లో కవిత్వలక్షణాలు చెప్పటం వేరు, కవిత్వలక్షణాలను కావ్యంలో సందర్భానుసారంగా, ప్రాస్తావికంగా చెప్పటం వేరు. అప్పుడప్పుడూ కొందరు కవులు తమ కావ్యాలలో ’కవిత్వం’ గురించి ప్రస్తావించటం కద్దు. అలాంటి సందర్భం మాఘుని శిశుపాలవధమ్ ద్వితీయసర్గలో ఉంది.  చేదిదేశపు రాజైన శిశుపాలుడు యాదవులపాలిట, సన్మార్గుల పాలిట కంటకంగా అయినాడు. రావణాసురుడే తిరిగి ద్వాపర యుగాన శిశుపాలుడిగా జన్మించాడేమో అన్నంతగా విషమకృత్యాలు చేస్తున్నాడు. శిశుపాలుని ఏ విధంగా ఎదుర్కోవాలని వాసుదేవుడు బలరామునితోనూ, ఉద్దవునితోనూ మంత్రాంగం చేయనెంచినాడు. ఆతడిపై దండెత్తి జయించాలని, ఇదే తగిన సమయమని సారాంశంగా బలరాముడు చెప్పాడు. ఆపై ఉద్దవుని సంభాషణ సాగింది. శత్రువుల బలాబలాలను, సామర్థ్యాన్ని మొదట తెలిసికొమ్మని ఉద్దవుని సారాంశం. ఈ విషయాన్ని చెబుతూ, మధ్యలో ఉద్ధవుని ద్వారా కవి (మాఘుడు) చెప్ప...

మయూఖము - 3

చిత్రం
దేవరాతుడు, భూరివసుడు చిన్ననాటి స్నేహితులు. "మనం పెద్దవాళ్ళైన తర్వాత మనకు అమ్మాయి అబ్బాయి కలిగితే వియ్యంకులు అవుదా"మని, కామందకి అనే ఓ బౌద్ధసన్యాసిని యెదుట బాసలు చేసుకున్నారు. అనుకున్నట్లు గానే దేవరాతుడికి మాధవుడు, భూరివసునికి మాలతి కలిగారు. చూస్తుండగానే పెరిగి యుక్తవయస్కులయ్యేరు. పెళ్ళికిబ్బంది లేదు కానీ ఇద్దరూ ప్రేమించుకుంటే బావుంటుందని దేవరాతుడు తన కొడుకు మాధవుణ్ణి భూరివసుడుండే పద్మావతీ నగరానికి 'అన్వీక్షకి ' విద్య నేర్వమని పంపేడు. అనుకున్నట్లుగానే మాధవుడు మాలతిని చూచాడు. అతనికి ఆమెపై ప్రేమ మొదలయింది. ఈ కథ ఇలా సాగుతుంది. పూర్తి కథను చందమామ కన్నా అందంగా ఇంకెవరు చెప్పగలరు ? భవభూతి రచించిన 'మాలతీమాధవమ్  ' అన్న నాటక కథ యిది. !******! పొగడపూలదండ. సంస్కృత నాటకాల్లో పూలదండల ప్రస్తావన రాంగానే 'కుందమాల ' నాటకం గుర్తొస్తుంది. సీతాదేవి ఓ మాల కట్టి నదిలో జారవిడువటం, అది రాముణ్ణి చేరటం, దాన్ని చూచి రాముడు, ఇది సీత కూర్పేనని గుర్తుపట్టటం అలా కథ కొనసాగుతుంది. ఆ నాటకంలో ఆ మాల అంతగా ప్రసిద్ధమై, మాల పేరే నాటకం పేరయ్యింది. తెలుగు వాళ్ళకూ విడలే...