చిరంజీవీ! రవీ! అభినందనలు. శారదాంబ కటాక్షం నీకు పరిపూర్ణంగా లభిస్తోంది. చక్కని కృషి నీ పద్యాలలో కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన నూతన ప్రయోగాలతో పాఠకులనింకా ఇంకా అలరింప చేయగలవని నా ప్రగాఢ నమ్మకం.శుభమస్తు.
ప్రతి తరం తన తదనంతర తరానికి వారసత్వంగా - తమ తరం నాటి అంతశ్చేతన యొక్క సారాంశాన్ని, విలువలను, ఆలోచనామృతపు మీగడతరకలను ఏదో రూపేణా అందిస్తూ రావడం మానవజాతికి సహజాతంగా వచ్చిన నేర్పు. ఈ విధమైన వారసత్వపు ప్రదానం సాహిత్యప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తున్నది. దీనికి ప్రధానకారణం - ప్రతితరంలో జన్మిస్తున్న పండితులు, సహృదయులు, అద్భుత విమర్శకులు, కవులు ఇత్యాది. ఈ పరంపరలో ప్రస్తుతం మన కాలానికి చెందిన కవి, సహృదయవిమర్శకులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు. వీరి సాహిత్య వ్యాససంపుటి "వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్న విశేషాంశాలు" పేరుతో ఇప్పుడు లభిస్తున్నది. ఇటువంటి పుస్తకం, ఇంత నాణ్యతతో, ఒక్క స్ఖాలిత్యము, ముద్రారాక్షసము లేకుండా, చక్కని ప్రింట్ తో వెలువడడం ఒక్కరి వల్లనో, ఇద్దరివల్లనో సాధ్యం అయేది కాదనుకుంటాను. ఈ కృషి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి అంబ సరస్వతి కరుణాకటాక్షాలు ప్రసాదిస్తుంది. శ్రీ ఏల్చూరి వారి ఈ వ్యాససంకలనాన్ని - ఒక పుల్లెల రామచంద్రుడు గారి వ్యాససంకలనం తోనూ, సంస్కృత సాహిత్యం మీద ఆంగ్లంలో అద్భుత విమర్శలు వెలయించిన శ్రీ రాఘవన్ గారి వ్యాసాలతోనూ పోల్చవచ్చు. బహుశా కొన్ని అంశాలలో ఒ...
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
చిరంజీవీ! రవీ!
రిప్లయితొలగించండిఅభినందనలు.
శారదాంబ కటాక్షం నీకు పరిపూర్ణంగా లభిస్తోంది. చక్కని కృషి నీ పద్యాలలో కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది.
అద్భుతమైన నూతన ప్రయోగాలతో పాఠకులనింకా ఇంకా అలరింప చేయగలవని నా ప్రగాఢ నమ్మకం.శుభమస్తు.
నమస్కారం గురువు గారండి. ఇంకా బాగా కృషి చేయాలి. ఇంకా మీరు చూపించిన శ్రీ బంధము నేర్చుకోవలసి ఉంది.
రిప్లయితొలగించండి