నేను వ్రాసిన మొదటి సంస్కృత శ్లోకం
                                    కస్యాః ముఖం శర్వమనోనిధానమ్ ?  ప్రీత్యా త్రినేత్రస్తు కరోతి కిం తాం ?  దృష్ట్వా తు తౌ మోదమవాప్యవాన్ కః ?  గౌరీముఖం ; చుమ్బతి ; వాసుదేవః                                    పై శ్లోకంలో దోషం చెప్పిన వారికి ఆ దోషపరిహారం చేసే బాధ్యత కలదు .  (11 వ త్రిష్టుప్ ఛందంలోని ‘ ఇంద్రవ్రజ ’  అనే వృత్తం. దీని గణాలు ‘ త-త-జ-గగ(గా) ’ లు. తెలుగులో యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది. )  ఆ శ్లోకానికి కంది శంకరయ్య గారి అనువాదం.  (గురువు గారు, అది నా ప్రయోగం అని గ్రహించలేదు. అయినా మన్నన దొరికింది కాబట్టి సంతోషం)  తే.గీ|| ఎవరి ముఖమును హరుఁడు వీక్షించినాఁడు ?  ప్రీతి దాని నేమి యొనర్చెఁ ద్రినయనుండు ?  పొంచి దానిని వీక్షించి మురిసె నెవఁడు ?  గౌరి ముఖమును ; చుంబించెఁ ; గరివరదుఁడు.  తెలుగే బావుంది.. మనస్ఫూర్తిగా.